వార్త‌లు

నిడదవోలులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ

గురువారం నిడదవోలు రోటరీక్లబ్ నందు నిడదవోలు నియోజకవర్గ వై.యస్.ఆర్.సీపీ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన” బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” నిడదవోలు నియోజకవర్గం విస్తృత స్థాయి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం, జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఊటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాలను ప్రతి […]

వార్త‌లు

మెగా పీటీఎం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వారధి

నిడదవోలు జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బంధం బలోపేతానికి ప్రభుత్వ కృషి ఇంటర్మీడియట్ లో మెరుగైన ఉత్తీర్ణత శాతం కనబర్చినందుకు యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్ యువత చెడు వ్యసనాల వైపు వెళ్లొద్దని సూచన..బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించిన మంత్రి దుర్గేష్ విద్యార్థులు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ నిడదవోలు: పేరెంట్‌-టీచర్‌

వార్త‌లు

విద్యార్థుల సమగ్ర పురోగతి కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఉండ్రాజవరంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటిఎం 2.0)లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో పండుగలా మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌..ఏటా రెండు పర్యాయాలు నిర్వహించాలని మంత్రి దుర్గేష్ ఆదేశం తరగతిగదుల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలుండాలని మంత్రి సూచన విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌ ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని

వార్త‌లు

జనసేనలోకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జెడ్పీటీసీలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు శ్రీ పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు శ్రీ ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు

వార్త‌లు

గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలి – కల్లు గీత సంఘం పిలుపు

గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కలు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం తణుకులోని అమరవీరుల భవనంలో తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షులు సమావేశం కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ గీతకార్మికులు అనేక సమస్యలతో ఉన్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ జిల్లాలో బెల్ట్ షాపులు 4 వేల

వార్త‌లు

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

మొదటి ఏడాదిలోనే 4.50 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి తణుకులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారధ్యంలో యువత భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు

లోకేష్‌ సారధ్యంలో విద్యావ్యవస్థలో మార్పులు గత వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం పేరెంట్‌ టీచర్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్‌ సారధ్యంలో విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఎన్నో మార్పులు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతోపాటు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్‌

వార్త‌లు

90 రోజులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా మీడియేషన్ లో కేసులు రాజీ

4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తణుకులో గురువారం జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ ఆదేశముల మేరకు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వం మీద కోర్టులు పనిచేయు ప్రతి చోట 90 రోజులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా మీడియేషన్ లో కేసులు రాజీచేయుట గురించి జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అవగాహన కల్పించి, మధ్యవర్తిత్వంలో ఎక్కువ కేసులు రాజీ చేయుటకు ప్రయత్నించాలని, తద్వారా సమయాన్ని కక్ష

వార్త‌లు

ధాన్యం రైతులకు శుభవార్త

24 గంటల్లో నిడదవోలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లకు గాను రూ.672 కోట్ల విడుదలకు అంగీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో

వార్త‌లు

తణుకు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎన్.సి.సి విద్యార్థులకు అవగాహన సమావేశం

తణుకు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎన్.సి.సి విద్యార్థులకు “2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనా మిషన్” మరియు” డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ కె.పద్మావతి వారి ఆధ్వర్యంలో ఎన్.సి.సి.ఆఫీసర్ సి.హెచ్.రాజు ఆర్గనైజ్ చేయగ,సికిల్ ఎనీమియా పై బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.డానియల్ రాజు అవగాహన కల్పిస్తూ”ఈ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్తకణాల రుగ్మత అని,తల్లి తండ్రి నుండి అనువంశికంగా వస్తుందని,దీనివలన రక్త హీనత,అలసట,నొప్పులు,శ్వాసలో

Scroll to Top