ముస్లింల అభివృద్ధికి ‘కూటమి’ కట్టుబడి ఉంది – రంజాన్ ప్రత్యేకప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
సమాజంలో సోదరభావాన్ని పెంపొందిచే రంజాన్ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టుబడి ఉన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకు పాతవూరులోని కొమ్మాయిచెరువు గట్టు వద్ద ఈద్గా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజంలో మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనల్ని మనం తిరిగి కొత్తదనంతో నింపుకోవాలని అల్లా ఆశీస్సులతో మంచి […]










