శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉగాది పర్వదినమున సందర్భంగా తణుకు మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాఖ్యాత, ప.గొ.జిల్లా బిజేపి నాయకురాలు డా.శ్రీమతి ముళ్ళపూడి రేణుక పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భముగా అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు మరియు నూతన వస్త్రములు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మా ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించినాము, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


