ఓట్ చోరీ కి వ్యతిరేకంగా నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ టి కె విశ్వేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ లూథర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నిడదవోలులో ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఓట్ చోర్-గద్ది చోడ్ ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో మోడీ, ఎలక్షన్ కమిషన్ ల దిష్టిబొమ్మలను నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ నుండి సంత మార్కెట్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు శవ యాత్ర లాగా ఊరేగించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.


