సామూహికంగా ఎలుకలను నిర్మూలించినప్పుడే పంటకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. వేలివెన్ను గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఎలుకల మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పైరూ లో 15 నుండి 20 శాతం వరకు ఎలుకల వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని సకాలంలో రైతులు వాటి నిర్మూలన చేపట్టాలని వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ఎలుకలు నిర్మూలించబడతాయని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి బ్రోమో డియోలిన్ మందు 96 పాళ్ళు, రెండు పాళ్ళు నూకలు, రెండు పాళ్ళు నూనె కలిపి మందు తయారుచేసుకుని చిన్నచిన్న పొట్లాలుగా కట్టి ఎక్కడైతే ఎలుకలు సంజీవ కన్నాలు ఉన్నాయో అక్కడ ఉంచాలని తెలిపారు. ఈ మందును తిన్నటువంటి ఎలుకలు 48 గంటల లోపు వాటి జీర్ణ క్రియ మీద ప్రభావం చూపి తదుపరి అవి చనిపోవడం జరుగుతుందని తెలిపారు. రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి అధిక యూరియా వాడకం వల్ల కలిగే నష్టాల గురించి యూరియాకు ప్రత్యామ్నాయంగా నత్రజని ఇచ్చేటటువంటి సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు మరియు నానో ఎరువుల వినియోగం వల్ల ఉపయోగాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పించి మానవహారంగా రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులు ఎక్కడా కూడా యూరియా దొరకదు అనే భావనలోకి వెళ్లకుండా దాల్వాకు అవసరమైనటువంటి యూరియాను ఇప్పుడే కొనుగోలు చేసుకోకుండా ప్రస్తుతం ఏ రైతులు కైతే వారికి ఉన్నటువంటి పంటలను బట్టి అవసరం మేరకు మాత్రమే యూరియాను సంబంధిత సొసైటీ లేదా ప్రైవేటు దుకాణాల ద్వారా తీసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వి ఏ ఏ Sk.రీషూ, రైతులు పాల్గొన్నారు.


