మిలాదుల్ నబీ పర్వదినం సందర్భంగా నిడదవోలులోని గణపతి సెంటర్ సమీపంలో మదరసాను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ మానవాళికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం ద్వారా ప్రతి మానవుడు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు చూపించాలని అపారమైన అల్లా దయవల్ల ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిలాద్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ తో చిన్నారులు సెల్ఫీలు దిగారు


