పోర్ట్ స్టేడియం విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతిజరిగిన దుర్ఘటన పై సీబీఐ విచారణ చేయాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కే.జి.హెచ్ మార్చురీ వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ యాజమాన్యం భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్ దృష్టికి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో పోర్ట్ స్టేడియంలో కార్టింగ్ కి వెళ్లి తమ మనవరాలు రోడ్డు పై పడిపోయి 45రోజులు మంచంపై ఉందని ఆ సమయంలో మా వారిదే పొరపాటు అయి ఉండొచ్చని తాను ఆ ఘటనపై స్పందించలేదన్నారు. యాజమాన్యము సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతముగా చేస్తున్నామని చెప్పారని, చిన్న పిల్లలు ఆనందానికి ఆదుకోవడానికి వస్తున్నారని సరియైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పానని తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలో చిన్నారి చావుకు కారణం విశ్వనాద్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మోటార్ సైకిల్ పై ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే చిన్న మృతి చెందడం జరిగిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, డబ్బు ఆపేక్ష లక్ష్యంగా యాజమాన్యం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండి పడ్డారు. వేసవి సెలవుల్లో పిల్లలు మృత్యుకూపంలోకి వెళ్లే అవకాశం ఉందని కాబట్టి కలెక్టర్ స్పందించి వెంటనే విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని కోరారు. భద్రతా ప్రమాణాలు లేని స్పోర్ట్స్ క్లబ్ లపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.


