తణుకు పట్టణంలోని సీఎం కన్వెన్షన్ హాల్ నందు జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS), కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులందరూ కలిసి కాపులకి రిజర్వేషన్ కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, జిల్లాపార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇందుగపల్లి బలరాం, తణుకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు చరణ్, తణుకు పట్టణ వైసిపి వైస్ ప్రెసిడెంట్ యారబాటి రామకృష్ణ, నియోజకవర్గ మైనారిటీ విభాగ అధ్యక్షులు జిలానీ, గారపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


