డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఇవన్నీ తెచ్చిన సర్వేపల్లి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా ఆచరిస్తామని ఆయన స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


