వార్త‌లు

రోడ్డు ప్రమాద బాధితులను చూసి స్పందించిన ఆరిమిల్లి

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఇద్దరు క్షతగాత్రులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చికిత్సనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తిలి మండల సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ మార్గంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ వెళుతుండగా స్థానిక అక్కమాంబ టెక్స్టైల్స్ వద్ద రెండు మోటర్ సైకిల్స్ ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన రాధాకృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు.

వార్త‌లు

స్వాతంత్ర సమరయోధుడు త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి

తణుకులో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతినీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు కాలనీ వద్ద ఉన్న స్వతంత్ర సమరయోధులు పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తణుకు సీనియర్ సిటిజన్స్ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు కోడూరి ఆంజనేయులు, ఆకేళ్ళ సుబ్రహ్మణ్యం, కౌరు వెంకటేశ్వర్లు, పేరూరి మురళికుమార్,

వార్త‌లు

గోదావరి జిల్లా సంక్రాంతి ఉత్సవాలలో హైదరాబాద్ ఎమ్మెల్యే

ఆంధ్రుల ప్రత్యేక పండుగ సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కే.సావరం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు స్వాగతం పలుకగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారని, వాటిలో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని

వార్త‌లు

ప్రభుత్వమే చేనేత రంగానికి ఊపిరి పోయాలి, నేతన్నలను ఆదుకోవాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు

అంపశయ్య పై ఉన్న చేనేత రంగానికి ఊపిరి పోయాలని, నేతన్నలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం క్యాలండర్లను సిపిఐ జిల్లా కార్యాలయంలోసోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలని, చేనేత కార్మికులకు 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్ళు, వర్క్

వార్త‌లు

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరిన సిపిఎం పార్టీ

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ కామన మునిస్వామి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం నాడు సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కరెంటు బిల్లును భోగిమంటలో వేసి దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపై 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్తు చార్జీల భారాలను మోపిందని అన్నారు. విద్యుత్ బిల్లులో ట్రూ ఆఫ్

వార్త‌లు

భోగి – సంక్రాంతి – కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరి, మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ కూటమి నాయకులతో కలిసి నివాసం నందు భోగిమంటలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి

వార్త‌లు

వడ్లూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలలో మంత్రి కందుల దుర్గేష్

భోగి భోగ భాగ్యాలనిచ్చే భోగిసరదాలను తీసుకొచ్చే సంక్రాంతికమ్మనైన కనుమ ఈ సంవత్సరం2025లో అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్.

వార్త‌లు

గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు నియోజకవర్గంలో తణుకు మండలం మండపాక, అత్తిలి మండలం వరిగేడు, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించి పశువుల షెడ్లు 4 పశువులు ,మరియు 6 పశువులు నిర్మాణానికి 1,85,000 మరియు 2,40,000 వేల రూపాయలు కేటగిరీలలో పశువుల షెడ్డు ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో

వార్త‌లు

ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో స్వామివివేకానంద 162వ జయంతి

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో స్వామి వివేకానంద 162వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద చిత్రపటానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అందుకే ఆయన పుట్టినరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. దేన్నైనా సాధించాలంటే ఆత్మీయ విశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం

వార్త‌లు

కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు – తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్‌

సబ్‌ డివిజన్‌ పరిధిలో 300 మంది బైండోవర్‌తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్‌సంక్రాంతి పురస్కరించుకుని కోడిపందేలు, పేకాట, గుండాట తదితర చట్టవ్యతిరేక జూదక్రీడలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనా«ద్‌ హెచ్చరించారు. తణుకు పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తణుకు పట్టణ, రూరల్‌ సర్కిళ్ల పరిధిలో శాంతిభద్రతలు కాపాడే ఉద్దేశంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందేలు, జూదం, గుండాట వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచామన్నారు. ఇప్పటికే తణుకు, తణుకు

Scroll to Top