వార్త‌లు

మూడు గేదెలను నరికి చంపిన దుండగులు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో గురువారం అర్ధరాత్రి అతి ఘోరంగా వ్యవసాయ క్షేత్రంలో గల పశువుల మకాంలో మూడు పశువులను నరికి చంపిన దుండగులు. ఉదయం పొలము వెళ్ళిన రైతు రక్తపుమడుగులో మడుగులో మరణించి ఉన్న తన పశువులను చూసి నిర్ఘాంతపొయాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాజకీయ కక్షలో భాగమా లేక గంజాయి బ్యాచ్ చేసిన పన అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు సిబ్బంది.

వార్త‌లు

అతి పురాతనమైన రథయాత్ర – పూరీ జగన్నాథుని రథయాత్ర

ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. 🔸 జులై 7న పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 🔸 చివరిసారిగా 1971లో ఒకే రోజున మూడు వేడుకలు జరగ్గా

వార్త‌లు

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఈనెల రికార్డు స్థాయిలో 1 కోటి 45 లక్షల రూపాయలు హుండీ ఆదాయం

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈనెల రికార్డు స్థాయిలో 1 కోటి 45 లక్షల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి

వార్త‌లు

తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా – డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్

తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ వెలగల అరుణ ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధుల్లో ఉన్న ఆర్థోపెడిషియన్ వైద్యులు డాక్టర్ సాయికిరణ్ తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు

వార్త‌లు

తణుకు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడిఈ గా దివాకర్

తణుకు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏ డి ఈ గా దివాకర్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ నుండి బదిలీలలో భాగంగా తణుకు సబ్ డివిజన్ ఏ డి ఈ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడిఈ శ్రీనివాస్ ఇటీవల మృతి చెందడంతో ఆయన స్థానంలో దివాకర్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

వార్త‌లు

గత ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించిన జగన్‌

గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా చేసిన వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం తణుకులో అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి గ్రామానికి గంజాయి, డ్రగ్స్‌ పరిచయం చేసిన దుర్మార్గుడు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరో పించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో గంజాయి పండించి అక్రమంగా వ్యాపారం చేసి విరివిగా అన్ని గ్రామాలకు గంజాయి సరఫరా చేసే విధంగా వైసీపీ

వార్త‌లు

మత్తుపదార్ధాలు జీవితాన్ని నాశనం చేస్తాయి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక, అక్రమరవాణా దినోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి ఆదేశాలు మేరకు ప్యానెల్ న్యాయవాదులు రిమాండ్ ముద్దాయిలకు అవగాహన కల్పిస్తూ మత్తుపానీయాలకు దూరంలో ఉండాలని, గంజాయి సాగు చేయుట, రవాణా చేయుట, త్రాగుట నేరమని, కఠినమైన శిక్షలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు తెలిపారు, డాక్టర్ శ్రీ రాజ్ మాట్లాడుతూ మత్తుపానీయాలు ద్వారా ఆరోగ్యం పాడవుతుందనీ, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు వస్తాయని, మత్తుపదార్ధాలు జీవితాన్ని

వార్త‌లు

ఉభయగోదావరి జిల్లాల పర్యాటక కేంద్రప్రాజెక్టు అఖండ గోదావరి – మంత్రి కందుల దుర్గేష్

రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్ ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంక, పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ దేవాలయం,గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నాం:మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసుకొని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను న్యూఢిల్లీలో కలిశాం..తొలి నుండి సంపూర్ణ సహకారం అందించి

వార్త‌లు

నరేంద్రమోడీ పదకొండు సంవత్సరాల పాలనపై కరపత్రాల పంపిణీ

వికసిత భారతదేశపు అమృత కాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే నినాదాలతో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనా కాలం పై కరపత్రాలను ఆచంట మండలంలోని వేమవరం ,పెనుమంచిలి, కందరవల్లి, కరుగోరిమిల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పంచి పెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, అవినీతి రహిత పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో మండల బిజెపి అధ్యక్షులు నేదునూరి శ్రీనుబాబు, మాజీ

వార్త‌లు

మత్తు పదార్ధాలతో జీవితం చిత్తు – నిడదవోలు ఎక్సైజ్ సి.ఐ.సతీష్

అంతర్జాతీయ మాదకద్రవ్య వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం – జూన్ 26 ను పురస్కరించుకొని సమిశ్రగూడెంలో గల “వికాస్ జూనియర్ & డిగ్రీ కాలేజ్” నందు విద్యార్ధినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు NDPS చట్టం 1989 ప్రకారం మాదకద్రవ్య వినియోగం, రవాణా, కోనుగోలు మరియూ అమ్మకం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడితే విధించే శిక్షలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Scroll to Top