కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు శ్రీ పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు శ్రీ ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి కొమ్మిశెట్టి రజనీ పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం శాసన సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కరాటం సాయి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయన్నారు


