ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 విభాగంలో జిల్లా స్థాయి పాటల పోటీలు సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 15 వరకు వివిధ ప్రాంతాలలో జరిగిన స్పోర్ట్స్ గేమ్స్ ఎంపికలు ఎస్. కే. ఎస్. డి. మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి ఎంపిక కాబడిన విద్యార్థినులను అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎస్. కే. ఎస్. డి. కళాశాల నుండి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో కల్పించబడిన అన్ని రకాల క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని ఉత్తమ సాధన చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రీడలలో పాల్గొని మంచి ప్రతిభను ఘనపరిచారని అదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొని మంచి విజయాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన బ్యాడ్మింటన్ లో ఎం. మనోజ్ఞ ( ఫస్ట్ ఎం పిసి ) డి. నవ్య ( సెకండ్ సిఎస్సి ) కే.గీత ( ఫస్ట్ ఎంపీసీ ) పి.రోషిత (సెకండ్ ఏ అండ్ టి ) జి. రేష్మ ( సెకండ్ ఎ అండ్ టి) ఎస్.కే.సల్మా ( సెకండ్ సిఎస్సి) కే.కుసుమ (ఫస్ట్ సి ఎస్ ఈ) ఎల్.సుష్మ (సెకండ్ ఎం పి హెచ్ డబ్ల్యు) టేబుల్ టేబుల్ టెన్నిస్లో బి. పురందేశ్వరి ( సెకండ్ సిఎస్సిఈ ) చెస్ యందు జి. హేమలత (సెకండ్ ఎంపీసీ), ఎస్.సువార్త (ఫస్ట్ ఎం పి హెచ్ డబ్ల్యు ) వి.మౌనిక (ఫస్ట్ ఎంపీసీ ) కబడ్డీలో ఎం. కీర్తి (సెకండ్ సి ఎస్ ఈ ) కే. మోహన (సెకండ్ సి ఎస్ ఈ ) బి.నందిని (ఫస్ట్ ఎం పి హెచ్ డబ్ల్యు ) జె.లావణ్య (ఫస్ట్ బైపిసి ) కోకోలో జి. లావణ్య (సెకండ్ ఎంపిహెచ్డబ్ల్యూ) బి. వర్షిత (సెకండ్ సి ఎస్ ఈ ) పి.ధరణి (సెకండ్ సిఎస్. ఈ ) వాలీబాల్ యందు ఏ. ఝాన్సీ( సెకండ్ సిఇసి ) పి.జ్యోతి ( సెకండ్ ఏ అండ్ టి ) జి.అనూష (సెకండ్ బైపిసి ) యోగాలో పీ.కీర్తి (సెకండ్ సి ఎస్ ఈ ) ఏ.ఇందు ( ఫస్ట్ సి ఎస్ ఈ ) బాల్ బ్యాడ్మింటన్ లో జి.నాగ పద్మ (ఫస్ట్ సీఈసీ) వి. ప్రవల్లిక (ఫస్ట్ బైపిసి) ఎస్. సువార్త (ఫస్ట్ ఎం పి హెచ్ డబ్ల్యు) యు.హారిక (ఫస్ట్ సీఈసీ ) టెన్నికాయిట్లో ఆర్. సారిక ( సెకండ్ సి ఎస్ ఈ) త్రో బాల్ యందు ఎం. పుష్ప క్రాంతి (ఫస్ట్ బైపిసి) క్రికెట్లో ఎం.సిరి (సెకండ్ సి ఎస్ ఈ) హ్యాండ్ బాల్ లో జె. లావణ్య (ఫస్ట్ బైపిసి) బాస్కెట్ బాల్ యందు ఎస్.భారతి (సెకండ్ ఏ అండ్ టి) హాకీలో వి. బాలసత్యశ్రీ (ఫస్ట్ హెచ్ ఇ సి) బీ.పురందేశ్వరి (సెకండ్ సి ఎస్ ఈ) డి.మాధవి (ఫస్ట్ ఏ అండ్ టి) పి. జ్యోతి శ్రావణి (ఫస్ట్ హెచ్ ఇ సి) అథ్లెటిక్స్ విభాగంలో 200 మీటర్ల పరుగుపందెంలో కే. నందిని (ఫస్ట్ సీఈసీ) నుండి విద్యార్థులు ఎంపికయ్యారని తదనంతరం జరుగు రాష్ట్రస్థాయి పోటీల యందు వీరు అంతా పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డి.తారక మహాలక్ష్మి, అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


