మద్యం పేరు చెప్పి పేద ప్రజల రక్తం మాంసాలను కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు, నకిలీ మద్యంపై పోరులో వైయస్సార్సిపి రాష్త్ర వ్యాప్త పిలుపులో భాగంగా సొమవారం తణుకులో వైసిపి శ్రేణులు భారీయెత్తున నిరసన చేపట్టాయి. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ కూటమి పాలనలో అడుగంటు పోయింది. తణుకు నియోజకవర్గంలో 156 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కారుమూరి. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడు పోతున్నారు. ప్రజల గుండెలన్నీ, రక్తన్ని, మాంసాన్ని కూటమి నేతలు పిండేస్తున్నారని తణుకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిల్ లో మందు కింద పోసి నిరసన తెలిపిన మాజీ మంత్రి కారుమూరి. నారావారి నకిలీ మద్యం నశించాలంటూ ప్లే కార్డులతో వైసీపీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో వైసిపినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


