తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మదర్ దెరిస్సా జయంతి, మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్.వి.ఎస్.స్కూల్ నందు మదర్ థెరీసా పటానికి పూలమాలలు వేసి అంజలి సమర్పించారు. విద్యార్థిని విద్యార్థులకు బ్రెడ్, బిస్కెట్ చాక్లెట్స్ పంపిణీ చేసినారు.
అనంతరం అదే స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మట్టి గణపతి పై అవగాహన కల్పించేలా విద్యార్థినీ విద్యార్థులచే మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించి వారికి బహుమతులు అందజేశారు. మొదటి విజేతగా మట్టి పసుపు కుంకుమలతో చేసిన వినాయకుడిని తయారుచేసిన సిక్స్త్ క్లాస్ వై శర్మకు, కాయగూరలతో తయారు చేసిన ఎస్ పవన్ కు బహుమతులు అందజేశారు. అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు 200 మందికి స్కూల్ యాజమాన్యానికి మట్టి గణపతి పతిమలను పంపిణీ చేసినారు
ఈ కార్యక్రమానికి గేట్ మెంబర్ లైన్ వావిలాల సరళదేవి అతిథిగా పాల్గొన్నారు
అదేవిధంగా క్లబ్ సెక్రటరీ రాంకుమార్ స్కూల్ ప్రిన్సిపాల్ కేశవరావు, లైన్ నెంబర్స్ వావిలాల వెంకట రమేష్, ఏ.శ్రీనివాసరావు, వి. సుబ్రహ్మణ్యం, వి.నాగలక్ష్మి, బెజవాడ సూరిబాబు, బి.సత్య శ్రీ, ఏ సత్యనారాయణ, బి.వెంకటరమణ, వీ.జ్యోతి, ఏ రమేష్, ఏ.గంగాధర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.


