1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుండి నేటి వరకు Nation First – Party Second- Self Last అనే నినాదంతో ముందుకు వెళ్ళుతూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేస్తూ, పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై, నేడు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామంటే, కోట్లాదిమంది కార్యకర్తల నిబద్ధత, జాతీయభావం కారణంగా పార్టీకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ “పార్టీ ఆవిర్భావదినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర బిజెపి నాయకురాలు డా.శ్రీమతి ముళ్ళపుడి రేణుక. దేశరక్షణే ధ్యేయంగా స్థాపితమై, ప్రజాసంక్షేమం, దేశనిర్మాణం కోసం అంకితమై, కోట్లాది కార్యకర్తల సంఘీభావంతో ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాల సందర్భంగా తణుకులో బిజెపి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నార్ని తాతాజీ, బోల్లాడ నాగరాజు, రాసబత్తుల అనుకుమార్, పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


