ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జనవరి 25న పాలకొల్లు బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటుచేసిన ఉద్యోగ దిక్సూచి (మెగా జాబ్ మేళా) పోస్టర్ ను కలెక్టర్ సి.నాగరాణి చేతుల మీదుగా సోమవారం పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జాబ్ మేళాలో 20 కంపెనీలు సుమారు 610 పోస్టుల భర్తీకి ఉద్యోగ దిక్సూచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదైనా సందేహాలు నివృత్తికి 9502024665, 9441841622, 7014896277 నెంబర్స్ నందు సంప్రదించాలని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిడి డిఆర్డిఏ ఎమ్మెస్ఎస్ వేణుగోపాల్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కె సి హెచ్ అప్పారావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్, ఆంజనేయులు, కిషోర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


