వార్త‌లు

దళితులంతా ఒక్కటి కావాలి-హక్కుల కోసం

తణుకు మండలం కొమరవరం గ్రామంలో బుధవారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత ఐక్యవేదిక సభా కార్యక్రమం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథి దళిత ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, సెక్రెటరీ పి. రాజేష్, తణుకు మండలం అధ్యక్షులు నక్క రమేష్ సభాధ్యక్షులు మద్దిపాటి ఏసు, ఉద్యోగ సంఘాల నాయకుడు జి.మధు సురేష్ మాట్లాడుతూ దళితుల మీద దాడులు జరిగితే ఊరుకునే రోజులు పోయాయి దాడికి ప్రతి దాడిచేసే విధంగా యువత ముందుకు రావాలని ప్రజా పోరాటాలకు […]

వార్త‌లు

సీఎం అప్పగించిన గురుతర బాధ్యత సమర్థంగా నిర్వహిస్తా: చీఫ్ విప్ జీవీ

ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్‌ విప్‌గా తనకు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహించి చూపుతానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ విప్‌గా అసెంబ్లీ సజావుగా సాగేందుకు నా బాధ్యతలు నిర్వర్తిస్తానని, ఈ పదవి ద్వారా కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం

వార్త‌లు

న్యూమోనియా పై అవగాహన సదస్సు ఉండ్రాజవరంలో

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అధ్యక్షతన మంగళవారం ఉండ్రాజవరం పీహెచ్సీలో నవంబర్ 12 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు జరుగు న్యుమోనియా కార్యక్రమం పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ఉండ్రాజవరం వైద్యాధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ బాల్యం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలంటే న్యుమోనియా లక్షణాలను వెంటనే గుర్తించడం వలన 0-5 వయస్సు గల పిల్లలను ప్రాణాల నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. న్యుమోనియా ఒక ప్రమాధకరమైన వ్యాధి 5

వార్త‌లు

ఉచిత ఇసుక కొరకు నిబంధనలు తప్పనిసరి

ఉచిత ఇసుక తరలింపు నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు, ట్రాక్టర్ యజమానులు వాపోతున్నారు. పెండ్యాల తీపర్రు ఇసుక ర్యాంపులలో ట్రాక్టర్లకు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, పెరవలి తహసిల్దార్ అచ్యుత కుమారి, తణుకు తహసిల్దార్ వర్మ, పెరవలి డిప్యూటీ తహాసిల్దార్ కే. సన్నిబాబు, తీపర్రు ఇసుక ర్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత ఇసుక

వార్త‌లు

అదనపు చెల్లింపులు ఏమి లేవా? వాస్తవం ఏమిటి?

ఇసుక ర్యాంపులలో.. లోడింగ్ చేసినందుకు బంటా వారికి తప్ప మిగిలిన చార్జీలు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారని ఆ ప్రకటన చూసి, తాను పెండ్యాల ఇసుక ర్యాంపులోకి ఈరోజు ఉదయం వెళ్ళానని అన్నారు. లోడింగ్ నిమిత్తం వెళ్లి బంటావారికి 500 చెల్లించి గట్టు మీదకు రాగానే ర్యాంపు కాంట్రాక్టర్లు ట్రాక్టర్ కు 700 చెల్లించాలని అన్నారనీ, తన వద్ద అంత మొత్తం లేదని 500 రూపాయలు ఇవ్వగలనని అనగా వాటినే తీసుకుని

వార్త‌లు

దళితుల కమ్యూనిటీ హాల్ అప్పగించని ప్రభుత్వం

నిడదవోలు సుబ్బరాజుపేటలో దళితుల సౌకర్యం కోసం SC…SP నిధులు నుండి 35లక్షలు ఖర్చు చేసి నిర్మించిన యస్సీ కమ్యూనిటీ హాల్ 2018లో నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ దళితులకు అప్పగించకుండా సచివాలయం ఏర్పాటు చేశారు వెంటనే సచివాలయం వేరే భవనంలోకి మార్చి దళితులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ KVPS ఆద్వర్యంలో సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్య క్రమంలో జువ్వల రాంబాబు, బైపే రాజేశ్వరరావు, అంబటి పుల్లారావు, కోడి

వార్త‌లు

మృతుల కుటుంబాలకు-అండదండగా ఉంటామని ఓదార్పు

ఇటీవల ఫ్లెక్స్ కడుతూ విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గురై ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలను, గాయపడిన వారి కుటుంబాలను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన మారిశెట్టి శ్రీనివాసరావు, పామర్తి నాగేంద్ర, కాసకాని కృష్ణ, బొల్లా వీర్రాజు కుటుంబాలతో పాటు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును

వార్త‌లు

సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు

ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన విధంగా ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని CPM పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు.శనివారం CPM రాష్ట్ర వ్యాప్త ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో కప్పల వెంకన్న సెంటర్, నరేంద్ర సెంటర్, గణేష్ చౌక్ వద్ద కరపత్రాలు మరియు గ్రూప్ మీటింగ్స్ CPM ఆధ్వర్యంలో జరిగాయి. చిత్త శుద్ధి తో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలలో

వార్త‌లు

దళితోద్ధారుడైన సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం

రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలైన దళితుల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ను పున ప్రారంభించి, దళిత యువత భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ఎస్సీ రుణాలు మంజూరు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి తమ బ్రతుకు కాలమంతా రుణపడి ఉంటామని మాదిగ రక్షణ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కండెల్లి శేఖర్ తెలిపారు. మండల కేంద్రమైన నల్లజర్లలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా మాదిగ రక్షణ పోరాట సమితి అధ్యక్షుడు

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )లో బాగంగాఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న నెంబర్ 1 స్కూల్ నందు ఉన్న పిల్లలతో క్యాన్సర్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా వైధ్యాధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల ఎవరైనా క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు అయితే, ఈ స్క్రీనింగ్ వల్ల అటువంటి వారిని గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించి వారిని క్యాన్సర్ బారిన

Scroll to Top