ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 20వ వార్డు నందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి జరుగుతోందని మంత్రి తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, తదితర లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


