ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో నెలవారి సమావేశాలలో భాగంగా స్వర్గీయ తాతిని వెంకట కృష్ణారావు ఇంటిదగ్గర ఆయన పెద్దకర్మ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మానవతా సభ్యులందరూ కూడా ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోసంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మానవతా సంస్థకి సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధాకరమైన హృదయాలతో పవిత్రఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ సంతాపం వ్యక్తం చేసినారు ఈసంతాప సభకి మానవతా సంస్థ ప్రముఖులు మండల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్. మండల కో చైర్మన్ కటారి సిద్ధార్థ రాజు, రీజియన్ కమిటీ కోచ్ చైర్మన్ వెలిచేటి బోసు, అడ్వైజర్ కమిటీ చైర్మన్ పైపూరి మాణిక్యాలరావు మరియు జిల్లా డైరెక్టర్స్ సాగిరాజు జానకి రామరాజు, గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్. వి. సతీష్,(26) మంది మండల మానవతాసభ్యులు ఈ సంతాప సభలో పాల్గొన్నారు.

