డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి దశలు భారీగా కృషి
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకు పట్టణంలో గ్రామదర్శని కార్యక్రమం
రాబోయే జూన్ నాటికి టిడికో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకు పట్టణంలోని 25, 17 వార్డుల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన టిడ్కో నిర్మాణాలు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. త్వరలోనే పనులు పూర్తిచేసేలా సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. ఆయా వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు సమస్య స్థానికలు ఎదుర్కొంటున్నారని త్వరలోనే ఎందుకు సంబంధించి నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేసి అలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు రానివారికి దరఖాస్తులను ఆన్ లైన్ చేసి త్వరలోనే ఎవరికి పెన్షన్లు అందించే ప్రక్రియ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే వేసవిలో తణుకు పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరష్కారం కాకపోతే 9493422222 వాట్సాప్ నెంబర్ ద్వారా తనకు క్లియర్ చేయవచ్చని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.


