రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళలు అన్నిరంగాలలో అభివృద్ధి చెందుటకు అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. పెరుగుతున్న కార్యక్రమాలు అన్ని సక్రమముగా, సకాలంలో విజయవంతంగా అమలు కావాలంటే మహిళా సమాఖ్యలు బలంగా పనిచేయాలి. కాబట్టి మహిళా సమాఖ్యలు సోషల్ కాపిటల్ ను పెంచుకోని, వారికి కావలసిన శిక్షణలు ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పలితాలు వస్తాయని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్క పేదమహిళ అవసరాలను గుర్తించి వారికి కావలసిన చేయూత అందించడానికి, గ్రామసంఘం స్థాయిలో ప్రతి పది సంఘాలకు ఒక ఈ నారీ ని 25 సంఘాలు పైబడిన గ్రామ సంఘాలలో ఇద్దరు సి.ఆర్.పి.లను గ్రామసంఘం స్థాయిలో గుర్తించి వారికి ఒక రోజు శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళవారం వెలివెన్ను క్లస్టర్ లో గల 57 మంది ఈ నారీ మరియు 13 మంది సి.ఆర్.పి. లకు శిక్షణ ఇవ్వడం కొరకు ఈ కార్యక్రములో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మద్దా సంపత్ కుమార్ పాల్గొని ఈ నారీ మరియు సి.ఆర్.పి. విధి విధానాలు గురించి మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ.పి.యం. టి.బాలకోటయ్య, సి.సి. లు, విఓఏ లు మరియు ఈ నారీ మరియు సి.ఆర్.పి లు హాజరు అయ్యారు. మండలం మొత్తం మీద గ్రామ సంఘాల వారిగా అక్కడ ఉన్న సంఘాలను బట్టి మొత్తం 152 మరియు సి.ఆర్.పి. 78 మందిని గుర్తించి బ్యాచ్ ల వారిగా మంగళవారం నుండి 22 వరకు శిక్షణ కార్యక్రమము జరుగుతుందని ఎ.పి.యం. టి.బాలకోటయ్య తెలిపారు.


