నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం పెరవలి గ్రామం దీపిక కన్వెన్షన్ లో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ అభిమానుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెన్నెముక కార్యకర్తలే అని, వారి శ్రేయస్సు కొరకు చంద్రబాబు నాయుడు నిరంతరం ఆలోచిస్తూ పార్టీని విజయపథంలో నడిపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. పాల్గోని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం 75 కిలోల కేక్ కట్ చేసి,పేదలకు దుస్తులు,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు.


