తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఏప్రిల్ 12న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరగనుంది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఈ మేరకు అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరానికి చెందిన ఆంధ్ర వాయిస్ రిపోర్టర్ పి. వీరలత మహిళా జర్నలిస్టుల విభాగంలో ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక కావడం విశేషం. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత, సమాజం పట్ల ఆమె చూపిన బాధ్యతాయుతమైన దృక్పథం ఆమెకు ఈ పురస్కారాన్ని అందించాయి. ఇప్పటికీ అనేక పర్యాయాలు ఎన్నో అవార్డులు పొందిన శ్రీ లత, ఈసారి ఉగాది పురస్కారానికి ఎంపిక కావడం పట్ల విశాఖపట్నం జర్నలిస్టు వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పత్రికా రంగంలో పలు కీలక కథనాలతో ప్రాచుర్యం పొందిన ఆమె, అవసర సమయంలో తోటి జర్నలిస్టులకు అండగా నిలిచిన సందర్భాలు అనేకం. “శ్రీలత వంటి జర్నలిస్టులు వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారు. ఆమె మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాం,” అని పలువురు సహచర జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు ఆమె జర్నలిస్టిక్ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలవనుంది.


