తణుకు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పొతర్లంక సాయిరామ్ శనివారం తణుకు సబ్ జైలును సందర్శించి ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్దాయిలు అనుభవిస్తున్న శిక్ష, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైల్ అదాలత్ గురించి ముద్దాయిలకు తెలియచేసారు. ఒక్కసారి ఇక్కడకు వచ్చిన వారు మరల ఇక్కడకు రాకూడదని , నేర ప్రవృత్తి మానుకోవాలని, న్యాయవాదినీ పెట్టుకునే స్తోమత లేని వారికి ఉచిత న్యాయ సలహా సహాయం అందించుట మరియు వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేయుట మండల న్యాయ సేవల కమిటీ ఉద్దేశమని, ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని, చట్టం తెలియక ఇబ్బందులలో పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైల్ విజిటింగ్ న్యాయవాది శ్రీమతి డి. కృష్ణకుమారి, పారా లీగల్ వాలంటీర్ ఎస్. వెంకటగిరి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, టి. సత్యనారాయణరాజు, ఏ. అజయ్ కుమార్, అంగజల శివ, జైలు సూపరింటెండెంట్ మోహనరావు పాల్గొన్నారు.


