తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరుశురామ్ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన శ్రీ జ్యోసుల కామేశ్వరరావుకు పరుశురాం పురస్కారాలు సందర్భంగా రాజమహేంద్రవరం నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరరావు శాలువాతో మరియు మూమెంట్లో తో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఉపాధ్యక్షులు మరియు ఉండ్రాజవరం బ్రాహ్మణ సేవా సమితి బ్రాహ్మణ సేవాసమితి అధ్యక్షులు జ్యోసుల సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు ఆకెళ్ళ శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు ఏలేశ్వరపు వెంకట రామకృష్ణమూర్తి, జ్యోసులు ఉదయ్ కుమార్ తదితరులు అభినందించినారు.


