ప్రముఖ పాత్రికేయులు సతీష్ చందర్ ను ఉగాది పురస్కారాలు పేరిట రాష్ట్రప్రభుత్వం అవమానించిన తీరును ఖండిస్తున్నాం
– గొల్లపల్లి అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 126 మందికి పురస్కారాలు అందజేస్తూ జీవో నెంబర్ 27ను జారీ చేసింది. ఆ జీవో లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయులు, నవలా రచయిత సతీష్ చందర్ పేరును 32 గా ప్రభుత్వం ప్రకటించి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది
అయితే ఆ మరుసటి రోజే జీవో నెంబర్ 28 పేరిట ఆ లిస్టు నుండి సతీష్ చందర్ పేరును ప్రభుత్వం తొలగించడం జరిగింది ఇలా పేరు ప్రకటించి మళ్లీ వారే ఆ పేరును తొలగించడం ద్వారా సతీష్ చందర్ ను అవమానించడం జరిగింది.
ఈ ప్రభుత్వం ఆ అవార్డును ఎందుకు ప్రకటించింది ఎందుకు తొలగించింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరాభవ నామ సంవత్సరంలో సతీష్ చందర్ ని రాష్ట్ర ప్రభుత్వం పరాభవించిందని ఈ ప్రభుత్వానికి ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని షెడ్యూల్ కులాలకు చెందిన సతీష్ చందర్ ప్రముఖ జర్నలిస్టుగా చీఫ్ ఎడిటర్ గా పనిచేయడం అదే విధంగా అనేక పుస్తకాలను రచించి ఆ పుస్తకాల ద్వారా ఈ సమాజాన్ని మార్చాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఒక మేధావి ప్రభుత్వం ఈ రీతిగా అవమానించడాన్ని సామాజిక న్యాయ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.


