పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు.
ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు బి. ఎం. గోపాల రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు 77 ఆకారంలో ఒదగగా మరికొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు త్రివర్ణ పతాకములు చేబూని దేశభక్తి ప్రబోధిత నినాదాలు చేస్తూ ఆనాటి జాతీయ నాయకులకు నివాళులర్పించి, దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతిన బూనారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందరూ ఐకమత్యంగా ఉండాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సుధారాణి , గంగాభవాని, మారుతి రామ్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, మాధవి లక్ష్మి, స్వతంత్ర భారతి, బుచ్చియ్య, పుష్పవల్లి, పావని, సూర్య చంద్ర కుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


