అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
సహకార రంగంలో ప్రతిభ, విశిష్టతకు గాను తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి సొసైటీకు ఉత్తమ సొసైటీగా నిలించింది. ఈ ప్రాంతంలోని రైతులకు చేసిస సేవలను గుర్తించి ఉత్తమ ఎఫ్పీవో కోఆపరేటివ్ విభాగంలో ‘ఎన్సీడీసీ అవార్డు అఫ్ ఎక్స్లెన్స్ ఫర్ కోఆపరటివ్స్’ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ కమిషన్, ఆర్సీఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఈ ఎంపికను చేసి అవార్డు అందజేయడం అభినందనీయమన్నారు. రైతులు, ప్రజలకు ఇంత గొప్ప సేవలు చేసిన రేలంగి సహకార సంఘానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


