ఢిల్లీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి

అమరావతి: ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని,అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

Scroll to Top
Share via
Copy link