భీమవరం జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా గారి 135 వ. జయంతి వేడుకల్లో కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, పలువురు కవులు, సాహితీప్రియులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువులు కళాకారులను, తెలుగు పండితులను సత్కరించడం జరిగింది.💐🙏
సమరసతా స్వరం… జాతీయతా గళం,సమాజంలోని దురాచారాలను ధిక్కరించి అనేక కావ్యాల ద్వారా మూఢాచారాలపై తిరగబడ్డ తెలుగు కవి, సంస్కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మభూషణ్, కవికోకిల…. “గబ్బిలం” వంటి రచనలతో శ్రేణి భేదాలను బద్దలు కొట్టిన మహనీయుడు, భారతమాత గౌరవాన్ని కీర్తిస్తూ జాతీయ స్పూర్తి నింపిన శ్రీ గుర్రం జాషువ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం.

