తణుకులో ఘనంగా ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి

ప్రముఖ తెలుగు భాష కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు ఎస్ఎం స్కూలు నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ప్రాధాన్యత ఇచ్చిన పాత్రికేయుడు దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ గుంటూరు వెంకట చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుతనం మూర్తీభవించిన మహాకవి చిలకమర్తి అని అన్నారు. ఈ సందర్భంగా చిలకమర్తి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు వక్తలు ఆయన జీవిత విశేషాలపై మాట్లాడారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ ను, విశ్రాంత ఎన్టిపిసి డిప్యూటీ మేనేజర్ మందరపు సాయిబాబాను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేలపాటి చంటి, గోటేటి మారుతీ గోవిందరావు, మానవత వెంకటేశ్వరరావు, కామర్స్ పార్థసారథి, బర్రె శ్రీనివాస్, కే.రాంబాబు ఆలపాటి సుబ్బారావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, మహమ్మద్ వలి, బి.దుర్గాభాను, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link