వార్త‌లు

పర్యాటక రంగాన్ని మరింత వృద్దిలోకి తీసుకువస్తాము – మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉత్తరాంద్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ లు చేపట్టేవారిని ఆహ్వానిస్తున్నామని, ఈ మేరకు సుమారు 150 మంది ఇన్వెస్ట్ కు హాజరు కానున్నారని,15 మందితో ఎం.ఓ.యు ఒప్పందం చేసేందుకు అవకాశం ఉందని, అఖండ గోదావరి, గండికోట రు. 170 కోట్లతో అభివృద్ధి చేస్తామని, […]

వార్త‌లు

ప్రతిపౌరుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

పోడూరు: ప్రతీ భారతీయ పౌరుడూ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని యం.పి.టి.సి విప్పర్తి శారద అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం చింతలగరువు మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్.యం. కొల్లాబత్తుల సూర్యకుమార్ జాతీయజెండా ఎగురవేశారు. విద్యార్ధులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వడ్లపాటి రాజేంద్ర ప్రసాద్, టీచర్ వీరవల్లి బాలాజీ, రిటైర్డ్ టీచర్ జి.రామారావు, యస్.యం.సి. చైర్మన్ బి.వీరాంజనేయులు, వైస్ సర్పంచ్ కె.లోహిత దాసు, శీలం శ్రీనివాసు, శీలం

వార్త‌లు

డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కే.సావరం గ్రామసర్పంచ్ నార్ని రామకృష్ణకు ఆహ్వానం

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సర్పంచుల విభాగంలో ప్రత్యేక అతిధులుగా తూర్పుగోదావరిజిల్లా నుంచి హాజరైన నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కే.సావరం గ్రామ సర్పంచ్ సర్పంచ్ నార్ని రామకృష్ణ. సర్పంచ్ గా చేసిన విశేషకృషితో ఈఅవకాశం దక్కించుకున్న నార్ని రామకృష్ణను రాష్ట్ర పర్యాటక, సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందించారు. మండల సర్పంచులు, జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

వార్త‌లు

తణుకు సబ్ జైలును సందర్శించిన జడ్జి

తణుకు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పొతర్లంక సాయిరామ్ శనివారం తణుకు సబ్ జైలును సందర్శించి ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్దాయిలు అనుభవిస్తున్న శిక్ష, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైల్ అదాలత్ గురించి ముద్దాయిలకు తెలియచేసారు. ఒక్కసారి ఇక్కడకు వచ్చిన వారు మరల ఇక్కడకు రాకూడదని , నేర ప్రవృత్తి మానుకోవాలని, న్యాయవాదినీ పెట్టుకునే స్తోమత లేని వారికి ఉచిత న్యాయ సలహా సహాయం అందించుట

వార్త‌లు

జంతు సంక్షేమ పక్షోత్సవాలు – (జనవరి 14 నుండి 30వరకు)

అత్తిలి గ్రామపంచాయతీ పరిధిలో “జంతు సంక్షేమ పక్షోత్సవాల (january 14 th to 30th) సందర్భంగా వీధి కుక్కలకి గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో డాక్టర్ కే.నరసింహారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రాంతీయ పశువైద్యశాల, అత్తిలి వారి పర్యవేక్షణలో పశుసంవర్ధక సహాయకులు వీధి కుక్కలకి ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ , జిల్లా జంతు సంక్షేమసంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, మండల టిడిపి నాయకులు ఆనాల నారాయణ, ఆల్తి సత్యనారాయణ గ్రామ

వార్త‌లు

‘భారత అణుశక్తి పితామహుడు’ పద్మభూషణ్ హోమీ జహంగీర్ బాబా వర్ధంతి

పోడూరు : భారత అణుశక్తి పితామహుడు, పద్మభూషణ్ హోమీ జహంగీర్ బాబా వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చింతలగరువులో శుక్రవారం ఉపాధ్యాయుడు, న్యూమిస్మాటిస్ట్ కొల్లాబత్తుల సూర్య కుమార్ వద్దగల ‘భారత అణుశక్తి పితామహుడు’ హెచ్.జే.బాబా స్మారకాలను ప్రదర్శించారు.1909 అక్టోబరు 30న బొంబాయిలో జన్మించిన బాబా భారతీయ కేంద్ర భౌతిక శాస్త్రవేత్త వ్యవస్థాపక డైరెక్టరు గాను, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీఛార్జ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారని కాస్మిక్ కిరణాల జల్లులకు సంబంధించిన

వార్త‌లు

ఉండ్రాజవరంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఉండ్రాజవరం హైస్కూల్ యందు ఉండ్రాజవరం మండలం పోలీస్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారులు ఆధ్వర్యంలో మండలంలో గల సీనియర్ సిటిజన్ ఓటర్లు లను సన్మానించి ఓటు యొక్క విలువను, ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి, అవగాహన సదస్సును, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తహసిల్దార్ పి.యన్.డి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే సమర్థవంతమైన పరిపాలన పొందగలరని, రాజ్యాంగం

వార్త‌లు

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ – టి.రాహుల్ కుమార్ రెడ్డి

ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తణుకు పర్యటనకు రానున్న సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తణుకు ఎస్ ఎన్ వి ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలి ఫ్యాడ్ ప్రాంగణాన్ని, ప్రత్యామ్నాయంగా తేతలి హైవే పక్కన మరో హెలి ప్యాడ్ ప్రాంగణాన్ని, తేతలి పిఎంఏవై – ఎన్టీఆర్ నగర్ లే ఔట్ ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.రాజబాబుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనకు

వార్త‌లు

విద్యార్దులలో చైతన్యానికే బాలోత్సవం – తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్ నందు బాలోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ఈ బాలోత్సవం కార్యక్రమం రెండవసారి ప్రారంభించడం చాలా ఆనందమన్నారు. నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చి వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణము అన్నారు. ముఖ్యంగా ఈ బాలోత్సవం

వార్త‌లు

నల్లజర్ల పి.హెచ్.సీ.లో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్స్ పంపిణీ

నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మహమ్మద్ సిరాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ క్షయ రోగులందరూ క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు,రీచ్ ప్రాజెక్టు సంస్థవారు టీబీ పేషెంట్లను బరువు తక్కువగా ఉన్నవారిని దత్తత తీసుకొని వారికి పోషకాహార కిట్స్ అందజేయడం అభినందనీయం అని వైద్యాధికారి అన్నారు. టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు మందులు వాడుతున్న

Scroll to Top