మార్చి నెల 30న తణుకులో శ్రీనివాస కళ్యాణోత్సవం – తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
సుమారు 3 వేల మంది నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు – వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ఈనెల 30 ఆదివారం తణుకులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తణుకులోని నరేంద్ర సెంటర్, జూబ్లీ బ్రిడ్జి వద్ద నూలి గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 7.30 […]










