వార్త‌లు

టిడిపి కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని అన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి అని చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ […]

వార్త‌లు

ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం – విశాఖలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర

సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ సహజ యోగ ధ్యానాన్ని ప్రతిరోజూ ఆచరించటం వలన, కుండలినీ జాగృతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చునని సహజ యోగ రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ అన్నారు. శ్రీ మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 28 వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ యోగ చైతన్య ప్రచార రథయాత్ర జరుగనున్నది. ఈ రథం తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్,

వార్త‌లు

ప్రభుత్వపాఠశాలల ద్వారా ఉత్తమ విద్య అందుతుంది

తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు జరిగిన ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మావతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తణుకు మండల ఎంఈఓ -2 జి.బి.వి. ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల చరిత్ర, పాఠశాలలోని సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు గురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అదేవిధంగా పాఠశాల యొక్క ఘనమైన చరిత్రను కీర్తిని ప్రశంసిస్తూ తణుకు పరిధిలోని విద్యార్థులు ఈ

వార్త‌లు

పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది

ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ హోటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు వెల్లడి.. రెండు రోజుల పర్యటనలో 45 ప్రఖ్యాత సంస్థలతో భేటీలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు ఆతిథ్య రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన పేరొందిన పలు సంస్థలు

వార్త‌లు

తణుకులో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ. 23.18 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు – నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం శ్రీకారం చుట్టారు. తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం మండలాల్లో సుమారు రూ. 23.18 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాలు శాఖ

వార్త‌లు

ఓడినా బుద్ధి రాలేదు – ఏపీఐఐసీ ఛైర్మన్, టిడిపి జిల్లాఅధ్యక్షులు మంతెన రామరాజు

గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన రాష్ట్ర ప్రజలు ఓడించినప్పటికీ బుద్ధి రాకుండా వైసీపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లోంచి బయటకు ఈడ్చి తన్నుతామని, నరికి చంపేస్తామని మాట్లాడిన తీరును

వార్త‌లు

అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారు

నోటికి వచ్చినట్లుమాట్లాడితే రాజకీయాలు చెల్లవు మాజీ మంత్రి కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం అన్నీ మూసుకుని కూర్చోవాలని వైసీపీ నేతలకు హితవు – కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తణుకులో విలేకరుల సమావేశంలో కూటమి నేతలు ఎప్పుడో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్న వైసీపీ నాయకులు కక్షసాధింపు కొనసాగిస్తామని చెబుతూ నరికేస్తాం, బయటకు ఈడ్చి తన్నుతామంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడిన తీరును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ దుయ్యబట్టారు. రాజకీయాల్లో పదజాలం,

వార్త‌లు

సమస్యల పరిష్కారమే ప్రజా వేదిక లక్ష్యం

–నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే డా.చదలవాడ అరవిందబాబు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వసతులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా

వార్త‌లు

గ్యాస్ సిలిండర్ పై ఏభైరూపాయల పెంపు తక్షణమే ఉపసంహరించుకోవాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ గ్యాస్ సిలిండర్ కు ఏభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మోయలేని భారమని తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి

వార్త‌లు

షూటింగ్ సందర్భంగా రాజమండ్రి వచ్చిన దుల్కర్ సల్మాన్

ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ షూటింగ్ సందర్భంగా రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి సి.టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయనను గోదావరి నది ఓడ్డున మర్యాదపూర్వకంగా కలిసి, అలాగే మరిన్ని చిత్రాలను గోదావరి తీరాన చిత్రీకరించాలని కోరడం జరిగింది. సినిమాలు గోదావరి తీరన తీయడం వలన టూరిజం పెరుగుతుందని ఆయనకు వివరించారు. రాబోయే 2027 సంవత్సరంలో పవిత్ర గోదావరి పుష్కరాలు జరుగుతాయని తెలియజేశారు రాజమండ్రి సి.టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

Scroll to Top