వార్త‌లు

నాలుగవసారి మండల టిడిపి అధ్యక్షునిగా సింహాద్రి రామకృష్ణ

ఉండ్రాజవరం మండల టిడిపి అధ్యక్షుడిగా సింహాద్రి రామకృష్ణ ఎన్నికైనట్లు ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెలిపారు. మండల టిడిపి అధ్యక్షునిగా నాలుగవసారి ఎంపిక కావడంతో మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు సింహాద్రి రామకృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి చిత్తశుద్ధితో మరింత కృషి చేస్తానని, తనకు అభినందనలు తెలియజేసిన ప్రతి టిడిపి నాయకునికి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం వేలివెన్ను గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో టిడిపి ఆధ్వర్యంలో సంస్థగత కమిటీలు కార్యక్రమాలు ఏర్పాటు ఉందని వాటికోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో సమిష్టి కృషితో టిడిపి అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. నిడదవోలు పట్టణ అధ్యక్షుడు గా పనిచేసిన కొమ్మిన వెంకటేశ్వరరావు ఇటీవల పార్టీకి

వార్త‌లు

రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి – సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ డిమాండ్

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ డిమాండ్ చేసింది. భూస్వాములకు కొమ్ము కాస్తూ పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చి వేయడంపై సిపిఎం వేల్పూరు గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫోటో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే

వార్త‌లు

ఉండ్రాజవరం మండలం మానవత నెలవారీ సమావేశం

ఉండ్రాజవరం మండలం మానవత నెలవారీ సమావేశం ఆదివారం కఠారి సిధార్ధరాజు అద్యక్షతన పాలంగి మానవత భవనము నందు జరిగినది. సదరు సమావేశములో ముఖ్యఅతిధులుగా పాలంగి వాస్తవ్యులు మానవతసంస్థకు విరాళము అందించిన దాతలు నెక్కంటి సుధాకర్, నామాల శివరామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా పాలంగి మానవత సంస్థ తరుపున చిరుసత్కారం నిర్వహించారు. అదేవిదంగా సమావేశంలో 2025-26 సం.నకు నూతన కార్యవర్గ సభ్యులుగా ఉప్పలపాటి శ్రీనివాస్, అధ్యక్షులు, ఐసెట్టి విజయరాజు, సెక్రటరీ, మట్టపర్తి భువన కుమార్ ట్రెజర్ గా కమిటీ

వార్త‌లు

సోమవారం ఏప్రియల్ 28 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్

ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చెయ్యవొచ్చు – కలెక్టర్ పి.ప్రశాంతి ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 28 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల

వార్త‌లు

కూటమి ప్రభుత్వం రాకతో మారిన మత్స్యకారుల దశ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకున్న చంద్రబాబు వేట నిషేధ సమయంలో రూ. 20 వేలు సాయం విడుదల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థికసాయంను రెట్టింపు చేసి ఇచ్చిన హామీను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇందుకు సంబంధించి నిధులను

వార్త‌లు

ఉగ్రవాదాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం

దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం ఇరగవరం మండల కన్వీనర్ కామన మునస్వామి డిమాండ్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో సిపిఎం పార్టీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కామన మునీస్వామి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేశామని గొప్పలు చెబుతున్నా బిజెపి ప్రభుత్వానికి ఈ ఉగ్రవాదం సవాలుగా మారిందని అన్నారు. ఉగ్రవాదాన్ని మతంతో ముడి పెట్టరాదని మునిస్వామి అన్నారు. ఉగ్రవాదము ఎక్కడ

వార్త‌లు

చైత్ర బహుళ చతుర్దశి సందర్భంగా నందీశ్వరస్వామికి రుద్రాభిషేకం

చైత్ర బహుళ చతుర్దశి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో స్వయంభుగా వెలసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో శ్రీ మహా నందీశ్వరస్వామికి లఘున్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ప్రతీ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజున నందీశ్వరునికి అభిషేకం, ప్రత్యేక పూజలు వలన గ్రహదోషాలు తొలగి ఆరోగ్యం చేకూరి మనశ్శాంతి లభిస్తుందని అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు. అర్చన

వార్త‌లు

వేల్పూరు గ్రామానికి డంపింగ్ యార్డ్ కు అవసరమైన ప్రత్యేక స్థలం కేటాయించాలి – సిపిఎం గ్రామకమిటీ

డంపింగ్ యార్డ్ కు అవసరమైన ప్రత్యేక స్థలం కేటాయించాలని సిపిఎం వేల్పూరు గ్రామకమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఎం గ్రామకమిటీ ఆధ్వర్యంలో తణుకు డిప్యూటీ తహసిల్దార్ ఎన్. శ్రీదేవి కి సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందించినారు. ఈ సందర్భంగా సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో అతిపెద్ద జనాభా కలిగిన వేల్పూరు గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ మరింత విస్తరిస్తున్నదని ఆయన అన్నారు. అటువంటి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పోగేసిన

వార్త‌లు

తణుకు మండల పరిషత్ సాధారణ సమావేశము

తణుకు మండల పరిషత్ సాధారణ సమావేశము శుక్రవారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన మండల కార్యాలయ సమావేశమందిరంలో జరిగింది. సమావేశములో శాఖలవారీగా సంభదితశాఖల అధికారులు మండలంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి వివరించడం జరిగింది. సదరు సమావేశములో సభ్యలు అడిగిన సందేహాలకు నివృతం చేయడం జరిగింది.సదరు సమావేశమునకు ఎం.ఎల్.సి. వంక రవీంద్ర, జడ్.పి.టి.సి. సభ్యులు శ్రీమతి ముళ్ళపూడి అన్నపూర్ణ దేవి, మండల ఎం.పి.టి.సి. సభ్యులు, తహశిల్దార్

Scroll to Top