కూటమి ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యత
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కొమరవరంలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం తణుకు మండలం కొమరవరం గ్రామంలోని లక్ష్మీగణపతి నగర్లో రూ. 37 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డునిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం రూ. […]










