అహల్య బాయ్ హోల్కర్ త్రి శత జయంతి వేడుకలు మన రాజమండ్రి లో ఘనంగా నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా చత్తీస్గడ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ చావో గారు మరియు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు,ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, వివిధ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు
అండగా ఉంటా… అధైర్యపడొద్దు
నిడదవోలు పట్టణంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు. తొలుత పట్టణంలోని 4వ వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన గంగుల గోపియాదవ్ ను పరామర్శించి ఆరోగ్య వివరాలను, స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 8వ వార్డు లో ఇటీవల గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన నెత్తి ప్రకాష్
నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి
నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి క్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్ స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి దుర్గేష్ డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజారవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశంక్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు
ఘనంగా అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు..
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనమండలి సభ్యులు పి. వి. ఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో బారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పర్యవేక్షణలో రాణి పుణ్య శ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు స్థానిక వి. కె ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి
ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం పి.హెచ్.సి. వైద్యాధికారి డా. ఆర్. ఉషాదేవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డా. ఉషాదేవి గారు మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తు లైన ఖైని, గుట్కా, జర్దా, సిగెరెట్, చుట్ట, బీడీ మొదలగునవి సేవించడం వలన వాటిల్లో ఉండే నికోటిన్ అనే మత్తు పదార్ధము వలన, వాటికి బానిసలుగా మారిపోయి, అనారోగ్యం పాలగుతారని, ఊపిరితిత్తులు దెబ్బ తిని
అవినీతి అంతం కోసం… హక్కుల రక్షణ కోసం ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్!…
మానవ హక్కుల సంరక్షణ కోసం ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ ఉందని సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. అవినీతిని అంతం చేయడానికి వెనుకాడబొమని, ప్రజల సమస్యలపై పోరాడుతామని, ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగిన ఆర్ టీ ఐ ను సంప్రదించవచ్చు అని మీడియా ముఖంగా సమాజానికి తెలియజేయడమైనది. ఆర్టిఐ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ రాష్ట్రస్థాయి నియామక సమావేశం జరిగింది. పలువురికి ఆర్టిఐ సభ్యులకు గుర్తింపు
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు
విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు మరియు సూపర్ స్టార్ కృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయమై 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్ వారి ఆధ్వర్యంలో ఘనంగా
వేల్పూరులో భోజనశాల నిర్మాణానికి శంకుస్థాపన
కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భోజనశాల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కేవలం విద్యతోపాటు క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్లు
అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు స్వర్ణ పతకాలు
క్రీడాకారులకు అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ క్రీడలను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడి ఈనెల 27 నుంచి 29 వరకు శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇన్విడీషనల్ రోల్ బాల్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తణుకునకు చెందిన క్రీడాకారులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. సీనియర్ కేటగిరీలో రెడ్డి హర్షవర్థన్, జూనియర్ విభాగంలో నలమాటి షరత్రావు, గుల్లపూడి రంజిత్కుమార్, సబ్ జూనియర్ విభాగంలో రెడ్డి గగన్దీప్లతోపాటు కోచ్ లావణ్య, చందులను అభినందించారు.
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీలో ఆంక్షలు
కూటమి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు తొలగింపు మొదటి రోజు 98 శాతం పెన్షన్లు పంపిణీ లక్ష్యం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి గత ప్రభుత్వ హాయంలో పెన్షన్ల పంపిణీలో సైతం ఆంక్షలు విధించేవారని పలు కారణాలతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల నుంచి పెన్షన్ నిలిపివేసేవారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న అన్నారు. ఎన్టీఆర్ భరోసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 22వ










