వార్త‌లు

గత అయిదేళ్లలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యం

రాబోయే రోజుల్లో ఇంటింటికీ తాగునీరు లక్ష్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 3.50 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయ్యిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి మండలాల పరిధిలో రూ. 3.50 కోట్లు వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్లక్ష్యం […]

వార్త‌లు

29వ వార్డ్ ప్రకాశంపేట బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం

29వ వార్డ్ ప్రకాశంపేట గ్రామ దేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు ప్రకాష్ రావు పేట గ్రామ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రకాష్ రావు పేట గ్రామదేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల

వార్త‌లు

యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి

48 వ వార్డు యోగా అవగాహన ర్యాలీలో వార్డు జనసేన అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఉప్పులూరి యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందగలుగుతామని 48 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అన్నారు సోమవారం ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు పరిధిలో గల బర్మా క్యాంపు, ఇందిరానగర్, బాపూజీ నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాల్లో యోగ అవగాహన ర్యాలీ చేపట్టి ప్రజలకు యోగ ప్రాముఖ్యత ఆవశ్యకత విశేషాలపై అవగాహన

వార్త‌లు

అమరావతి పైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు

ఒక టీవీ ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు (దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని) చేసి మరలా తనని తాను సమర్ధించుకునే తీరు అత్యంత గర్హనీయం. కొంతమంది మేధావులుగా చెప్పుకునే విశ్లేషకులకు గాని జర్నలిస్టులకు గానిభాషా దారిద్యం, భావ దారిద్యం అంటే వారు ఏమి చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి కూడా పదాలు రాక వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని,పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే విధముగా వారియొక్క భాష ఉంది అంటే ఇవాళ

వార్త‌లు

తెలుగు మహిళలతో తన్నులు తినటం ఖాయం

సాక్షి టివి డిబేట్ లో అమరావతి మహిళా రైతులపై కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటలకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు వావిలాల సరళాదేవి ఖండిస్తూ అమరావతి మహిళా రైతులను వేశ్యలు అని మాట్లాడటం ఎంత వరకు సమంజసం, ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధిరాని మీకు సీటు అనేది లేకుండా ప్రజలు మిమ్మల్ని మూలన కూర్చో పెట్టేరోజు ముందు ముందు వుంది అని, అన్నపూర్ణతో సమానమైన మహిళా రైతులపై మీ పదజాలానీకి బదులుగా మీ

వార్త‌లు

విశాఖ బీచ్‌లో ఏడేళ్ల బాలుడి గల్లంతు – చెమటోడ్చి ఒడ్డుకు తీసుకొచ్చిన హోంగార్డు పరదేశి…

విశాఖ బీచ్‌లో ఏడేళ్ల బాలుడి గల్లంతు!..చెమటోడ్చి ఒడ్డుకు తీసుకొచ్చిన హోంగార్డు పరదేశి!…కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడి మృతి!.. విశాఖ బీచ్‌లో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బీచ్‌లో వాకింగ్‌ కోసం తెల్లవారుజామునే దువ్వాడకు చెందిన పి.సంతోష్‌ తన భార్య, ఇద్దరు కుమారులతో వచ్చారు. కుటుంబ సభ్యులంతా ఒడ్డునే కూర్చోగా ఏడేళ్ల సూర్య మాత్రం అలా అలా సముద్రంలోకి జరిగాడు. దీంతో ఆ బాలుడ్ని అలలు లాక్కెళ్లిపోయాయి. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ ట్రాఫిక్‌ హోంగార్డు దౌలపల్లి పరదేశి

వార్త‌లు

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడియపులంక సత్యదేవ నర్సరీలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి**డ్రగ్స్ నివారణ, సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి దుర్గేష్**యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచన*రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరు యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు,

వార్త‌లు

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన

*సీఎం ఆదేశాలతో త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాలో మూడు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన* *రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన, బొమ్మూరు లో సైన్స్ మ్యూజియం ప్రారంభం**ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై విస్తృత చర్చ.. రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడి* *స్పష్టమైన కార్యాచరణతో ఆయా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్* *త్వరలోనే మూడు కార్యక్రమాల

వార్త‌లు

కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన

*తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన* ఆల్కహాల్ అని పేరు ఉన్నవన్నీ మానవుడు సేవించడానికి అర్హమైనవి కావని వాటిలో ఇథై ల్ ఆల్కహాల్ మాత్రమే మానవుడు ప్రత్యక్షంగా సేవించవచ్చు. మిగతా ఆల్క హాల్స్ అన్ని కూడా ప్రమాదకరమని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. శనివారం పైడిపరులోని ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు వివిధ రకాల ఆల్కహాల్సు

వార్త‌లు

పల్లా శ్రీనివాసరావు తండ్రి మృతికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సంతాపం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన సంతాపాన్ని తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా సింహాచలం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Scroll to Top