వార్త‌లు

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి – పేదలకు చీరల పంపిణీ

విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వర్ధంతి కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలులు అర్పించారు. అనంతరం పేదల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. […]

వార్త‌లు

పల్స్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పల్స్ హాస్పిటల్ ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో, ఐసీయూ ఇన్ పేషెంట్ గదులు, ఔట్ పేషెంట్ గదులు, రోగికి రిలాక్స్ ఉండే విధంగా సహజ కాంతితో కూడిన వాతావరణ కల్పించామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఐసీయూ, ఇతర సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్

వార్త‌లు

ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ గా డి.రవికుమార్ భాధ్యతల స్వీకరణ

నిదదవోలు సర్కిల్, ఉండ్రాజవరం ఎస్.ఐ. గా డి రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈయన అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంగర పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించి, బదిలీపై ఉండ్రాజవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతంపలికి శుభాకాంక్షలు తెలిపారు.

వార్త‌లు

దమ్మెన్ను సర్పంచ్ కులవివక్ష – దళిత ఎంపిటిసి నడిరోడ్డుపై భైఠాయింపు

పంచాయితీ సభలో ఎంపీటీసీ తన ప్రక్కన కూర్చోవడం పై సర్పంచ్ అభ్యంతరం.దళితున్ని కాబట్టే సర్పంచ్ 4 సంవత్సరాలుగా పంచాయితీలోనికి రానివ్వలేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక సర్పంచ్ కులవివక్ష కారణంగా అదే గ్రామానికి చెందిన మరొక ప్రజాప్రతినిధికి తీవ్ర అవమానం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా సర్పంచ్ ప్రవర్తన ఒక దళిత ప్రజాప్రతినిధి నడిరోడ్డుపై బైఠాయించే పరిస్థితికి దమ్మెన్ను గ్రామము వేదిక అయింది. ఉండ్రాజవరం మండలం , దమ్మెను గ్రామంలో శుక్రవారం జరిగిన పంచాయతీ గ్రామసభ ఈ

వార్త‌లు

అభివృద్ధిని అటకెక్కించిన గత వైసీపీ ప్రభుత్వం

పిట్టకథలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న కారుమూరి ఘాటు వ్యాఖ్యలు చేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలి మండలంలో తిరుపతి పురం వరిగేడు తణుకు పట్టణంలో 12,13 వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గత ఐదేళ్ల వైసిపి పరిపాలనలో వ్యవస్థలను మీరు వీరియం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా సంక్షేమాన్ని పక్కలో పట్టించారని విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం

వార్త‌లు

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని యువత అనుసరించాలి

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అల్లూరి సీతారామరాజు అల్లూరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ యువతలో స్ఫూర్తి నింపే విధంగా తన పోరాట పటిమను బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అనేకసార్లు పోరాటాలు చేసిన ఘనత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని వేల్పూరు రోడ్డులోని విమాక్స్ థియేటర్ సెంటర్ వద్ద సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా

వార్త‌లు

విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా నియోజకవర్గ చర్యలు

తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాధాకృష్ణ స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ 2047 ప్రకారం తణుకు నియోజకవర్గం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు

వార్త‌లు

పేద వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వంగవీటి

తణుకులో ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు తణుకులో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వంగవీటి మోహనరంగా నిరంతరం కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 78వ జయంతి పురస్కరించుకుని శుక్రవారం తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో కులమతాలకు అతీతంగా

వార్త‌లు

తేతలి ఉన్నతపాఠశాలలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు

విప్లవజ్యోతి, మన్యంవీరుడు, అగ్గి పిడుగు, తెలుగుజాతి ఖ్యాతిగా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, తేతలిలో, ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 27 సంవత్సరములు జీవించిన అల్లూరి సీతారామరాజు నుండి మనమందరం దేశభక్తి, ధైర్యం, త్యాగనిరతి అలవర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జె. రాజకుమారి, జి సుధారాణి, పి. గంగభవాని, బి. ఎం. గోపాలరెడ్డి, ఎస్. రామకృష్ణ, పి.డి. వెంకటేశ్వరరావు, పి.

వార్త‌లు

మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి

అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి సందర్భంగా తణుకులో సీపీఐ నివాళులు… స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.మన్యం విప్లవవీరుడు అల్లూరి 128 వ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వీరనారాయణ ధియేటర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్

Scroll to Top