ఘనంగా బోదువలస ప్రభుత్వ పాఠశాలలో ‘మెగా పీటీఎం 3.0’

సేంద్రియ వ్యవసాయంపై చైతన్య కార్యక్రమం

విశాఖపట్నం: డిసెంబర్ 5 (కోస్టల్ న్యూస్)

బోదువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 3.0’ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారం రోజుల ముందుగానే ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా పాఠశాల అంతట పండుగ వాతావరణం నెలకొంది.
ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, దాతలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ కృతజ్ఞత వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు అనిత స్వాగత ప్రసంగం అనంతరం పాఠశాల పురోగతిపై సమగ్ర వివరణ ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా, హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు.

సేంద్రియ వ్యవసాయంపై చైతన్య కార్యక్రమం

కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయంపై చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి వంకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, కాకరకాయ, ఉల్లి, కాప్సికం, కేబేజీ, క్యారట్, ఆకుకూరల విత్తనాలను స్కూల్ ఆవరణలో నాటారు. సేంద్రియ ఎరువులతో పెంచిన ఆరోగ్యకర కూరగాయలు తినే అలవాటును అలవరచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి విత్తనాలు కూడా పంపిణీ చేశారు.
దాతల సహకారం కోరిన టీచరు
పిల్లల ఆడుబడి విస్తరణకు దాతలను ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. పిల్లల మానసిక వికాసానికి ఊయలలు, జారుడు బల్లలు, నిచ్చెనలు అవసరమని ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంలో అనిత టీచర్ స్వయంగా ఒక ఆట వస్తువును స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించారు. సత్కారాలు ఆత్మీయ విందు
కార్యక్రమం ముగింపులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వలయాకారంగా కూర్చుని షడ్రుచులతో డొక్కా సీతమ్మ అందించిన భోజనంను ఆస్వాదించారు. అనంతరం తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి, చీరలతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link