పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం గురించి బుధవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, తదితరులకు అవగాహన కార్యక్రమము వైద్యాధికారి డా.దుర్గామహేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ముందుగానే అనగా తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతుండ గానే స్కానింగ్ చేయుట ద్వారా లింగ నిర్దారణ చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అని, ఆ విధంగా ఎవరు చేసిన పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం ప్రకారము శిక్షించబడతారని తెలియచేశారు. ఆడ బిడ్డ అయితే అబార్షన్ చేయించి, చంపడం కొన్ని చోట్ల జరుగుతున్నదని, అది సరైన పద్దతి కాదని, ఆడబిడ్డ అయిన , మగబిడ్డ అయిన ఒకటే అని, ఇద్దరినీ సమానంగా చూస్తూ, ఇద్దరినీ చదివించాలని, తద్వారా ఆ కుటుంబం అంతా ఆర్థిక స్వాలంబన సాధించుటయే కాక, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆడ, మగ సమాన నిష్పత్తి ని కొనసాగించుటవలన, సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలని కూడా నివరించవచ్చునని, అందుకే ప్రభుత్వం ” ఆడ బిడ్డని రక్షించండి, ఎడగనివ్వండి, చదవనివ్వండి” అనే స్లోగన్ తో ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ.ఎం.సుబ్రహ్మణ్యం, పి.హెచ్.ఎన్. కే డి.వి.ఎల్. కుమారి, సుపరవైజర్లు సిహెచ్.రత్నకుమారి, ఏ.శ్రీరామమూర్తి, ఎ.ఎన్.ఎం.లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


