డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్)
మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర ఈ కుట్ర లో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి, దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకున్నటు వంటి హోల్సేల్ మేనమామ, జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవడం ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరం కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలోపడ్డాడు మోడీ అతని గుజరాతి పరివారం మొత్తం, ఎలక్షన్ కమిషన్ పావుగా వాడుకుని దొంగతనంగా గెలిచి తన పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి అందులో వాటాల కోసం కొట్టుకు చావండి అనే ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీ కరణ తలపైకి తేవడం జరిగింది. మిత్రులారా ఈ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని మోడీ నిర్వీర్యం చేశారు దమ్ముంటే ఎలక్షన్లు రద్దుచేసి స్వాతంత్రంగా బ్యాలెట్ పేపర్ తో గెలిచి తన సామర్థ్యాన్ని నిరూపించు కోవాలి. బిజెపి,కులాల మతాల పేరుతో ప్రజలను విభజించి పాలించే పద్ధతి ఎంతో కాలం కొనసాగదన్న విషయాన్ని బిజెపి గమనించాలి. అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాల సామాజిక వర్గం పై సాధిస్తున్న కక్ష సాధింపు విషయంలో ఇకనైనా పునర్ ఆలోచన చేసుకోవాలి ఎస్సీ వర్గీకరణ తప్పు వెనక్కి తీసు కోవాల్సిందే, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎస్సీ వర్గీకరణ టెంపరరీ మాత్రమే శాంతియుత నిరంతర పోరాటం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేవరకు, ఇప్పుడు ఇచ్చిన ఏడుగురు జడ్జిల తీర్పును 11 జడ్జిల, అంతకన్నా ఎక్కువ జడ్జిలతో ఈ తీర్పును పునః సమీ క్షించేంతవరకు ఈ నిరంతర శాంతియుత పోరాటం కొన సాగుతుంది. ఈ కార్య క్రమంలో గొల్ల ఈశ్వరరావు , మత్తి రత్నారావు, గొడుగు రాజు, సిమ్మాల దుర్గాప్రసాద్, శ్యామల రావు, నెల్లి సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.

