పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి విజయకేతనం ఎగుర వేసారని స్కూలు ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షకు హాజరైన 197 విద్యార్థుల్లో 596 మార్కులు సాధించిన విద్యార్థిని పి.బాల సత్య హరిణి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచింది. సి. హెచ్. యోషిత, ఆర్.ఎస్.ఎస్.ఎస్.చైతన్య 591 మార్కులు, బి.వేణు గోపాల్ మరియు వి.కార్తీక్ 590 మార్కులు సాధించారు. 580 కి పైగా 25 మంది విద్యార్థులు, 570 కి పైగా 44 మంది విద్యార్థులు, 560 కి పైగా 58 మంది విద్యార్థులు, 550 కి పైగా 73 మంది, 500 పైగా 127 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. మ్యాథ్స్ 100/100 సాధించిన విద్యార్థులు 65 మంది, సైన్స్లో 100/100 సాధించిన విద్యార్థులు 12 మంది, తెలుగులో 100/100 సాధించిన విద్యార్థులు 9 మంది మరియు సాంఘిక శాస్త్రంలో 100/100 8 మంది విద్యార్థులు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి మాట్లాడుతూ అనుభవం, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం మరియు బట్టీ విధానంతో కాకుండా అవగాహనతో కూడిన విద్యను అందించటం వలన ఇంతటి ఘనవిజయం రూట్స్కి సాధ్యమైందని తెలిపారు. స్కూల్ టాపర్స్ నిలిచిన విద్యార్థులను పుష్పగుచ్ఛంతో సంస్థ డైరెక్టర్స్ సత్కరించారు.
ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సంస్థ డైరెక్టర్స్ ఎల్.కె.త్రిపాఠి, బి.విద్యాకాంత్, ఎన్. సుధాకర్వర్మలు అభినందనలు తెలియజేసారు.



