రాజమహేంద్రవరంలో అటల్ బిహారి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ

రాజమహేంద్రవరంలోని గోరక్షణ పేటలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.

“అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అజేయ దేశభక్తి, సువ్యవస్థిత పరిపాలన, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన అటల్ బిహారీ వాజ్పేయ్ కి అంకితంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link