అమలాపురం పట్టణం లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టిబాబు అధ్యక్షతన, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామి నాయుడు ముఖ్య అతిధిలుగా పాల్గొని కేకు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు తనయుడు మెట్ల సత్య, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ మరియు చిరంజీవి అభిమానులు చేతుల మీదుగా వస్త్రాదానం, అన్నప్రసాదం వితరణ చేసినారు.
ఈ వేడుకలలో చిరంజీవి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షులు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…


